స్నేహాచ్చ బహుమానాచ్చ స్మారయే త్వాం న శిక్షయే ।
శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౨౪వ శ్లోకము) శ్రీరాముడు పరస్పర విరుద్ధములైన క్షాత్ర, తాపస ధర్మములు సూక్ష్మబుద్ధితో తూచా తప్పక పాటించాలన్న కాంక్షతో ఒక నీతికథను వినిపించినది సీతాదేవి. అది వినిపించిన తరువాత వినయముతో ఈ శ్లోకము పలికినది: “మీ మీద చనువుతో ఈ కథను మీకు జ్ఞప్తికి తెచ్చితినే కాని, ఇది హితబోధ ఏమాత్రమూ కాదు”. మీదుమిక్కిలి, మీకు ధర్మమును తెల్పగల సమర్థులెవ్వరు? ఒక గురువుతో (పతితో) శిష్యుడు (భార్య) ఎలామాట్లాడాలో ఈ శ్లోకముద్వారా సీతాదేవి మనకు…